Thursday, April 16, 2026
ads
Homeఎడిటోరియల్ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పర్యవేక్షించిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి

ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పర్యవేక్షించిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి

📰 Generate e-Paper Clip

నవగీతం,జగిత్యాల:

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి రోజు కావడంతో,జగిత్యాల,కోరుట్ల,మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి క్షేత్రస్థాయిలో సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు , సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు చేశారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అభ్యర్థులు మరియు వారి అనుచరులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (MCC) కచ్చితంగా పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా, శాంతిభద్రతల విఘాతానికి ప్రయత్నించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.అదనపు ఎస్పీ వెంట డిఎస్పి రాములు, ఇన్స్పెక్టర్లు కరుణాకర్, అనిల్ కుమార్, ఎస్.ఐ లు ఉన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular