నవగీతం,మల్లాపూర్:
మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో బాల బాలికలకు మూత్రశాలల నిర్మాణానికి బుధవారం ప్రజాప్రతినిధులు,అధికారులు, ఉపాధ్యాయులతో కలిసి పీఆర్ ఏఈ రాగసుధ స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ప్రతిపాదనలకు అనుగుణంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాలబాలికలకు మూత్రశాలల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఎంఈవో దామోదర్ రెడ్డి హెచ్ఎంలు చంద్రమోహన్ రెడ్డి, రాజేందర్, సుంచుల నర్సయ్య, ఉపసర్పంచ్ గడ్డం సోమరెడ్డి, నాయకులు పెద్దిరెడ్డి లక్ష్మణ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

