నవగీతం,జగిత్యాల
జగిత్యాల జిల్లాకు చెందిన ఎనిమిది మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన సుమారు 2 లక్షలు రూపాయలు విలువగల చెక్కులను ఆదివారం జగిత్యాల ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు దావ సురేష్, అయిల్నేని సాగర్ రావు,సాగి సత్యం రావు,వొళ్ళాల గంగాధర్, దయ్యాల మల్లారెడ్డి,కుడిక్యాల సర్వేశ్వర్,ఆరవెల్లి లక్ష్మణ్, యశ్వంత్ రావుపేట రాజు, పడిగేల గంగారెడ్డి ,గంగిపెల్లి వేణుమాధవ్,నీలి ప్రతాప్, ప్రశాంత్ రావు,వేణు,శేఖర్ రావు, గంగిపెల్లి శేఖర్,తదితరులు పాల్గొన్నారు.

