నవగీతం, రాయికల్ :
జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపల్ పరిధిలో జరిగిన ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కచెల్లెళ్లు ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. రాయికల్ మున్సిపల్ లోని 8వ వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కచెల్లెలు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఒకేసారి ఓటు వేయడం విశేషంగా మారింది.

