పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
మున్సిపల్ సాధారణ ఎన్నికల సందర్భంగా శుక్రవారం జరుగుతున్న కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన భారీ బందోబస్తును జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. భద్రత ఏర్పాట్లను ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించి అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు.

కౌంటింగ్ కేంద్ర పరిసర ప్రాంతాలలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేసి, అనుమతి పొందిన సిబ్బంది, ఏజెంట్లను మాత్రమే లోపలికి అనుమతించే విధంగా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సాఫీగా కొనసాగుతుందని అన్నారు. కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాలలో 163 సెక్షన్ అమలు చేస్తున్నామని అన్నారు.

