నవగీతం, మల్లాపూర్:
మల్లాపూర్ మండలంలోని గుండంపల్లి గ్రామానికి చెందిన జక్కుల నవదీప్ యాదవ్ ఇటీవలే వెలువడిన నవోదయ ప్రవేశ పరీక్ష లో సీటు సాధించిన సందర్భంగా నవదీప్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో మల్లాపూర్ మండల అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడు సంగ గంగరాజం, జిల్లా కార్యదర్శి ధన రేకుల సంతోష్ యాదవ్, గ్రామ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వేల్పుల రాజ గంగారం, తొట్ల మహేందర్, జక్కుల మధు, బుర్రి మల్లేష్, సంపతి హరీష్, బుర్రి సతీష్, సౌకాని శ్రీను, రెబ్బస్ అభి, దానవేణి హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

