నవగీతం,మెట్ పల్లి:
అక్షయ ఫౌండేషన్ ఇబ్రహీంపట్నం ఆధ్వర్యంలో స్థానిక వై కన్వెన్షన్ హాల్ లో పోటీ పరీక్షలు కు సిద్ధమయ్యే విద్యార్ధులకు నిర్వహించిన పరీక్షలో ప్రతిభ కనబరిచిన వంద మందికి ఉచిత మెటీరియల్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణానికి విచ్చేసిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి వి లక్ష్మీనారాయణ ను ఆదివారం జనసేన నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎలగందుల అజయ్, బండి రమాదేవి, పర్రె సంతోష్, అబ్బూరి ఆనంద్ రాజ్, మ్యడారపు మారుతి, భవేష్ తదితరులు పాల్గొన్నారు.

