Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలదేశ నిర్మాణమే బీజెపి లక్ష్యం- అదే బిజెపి విధానం

దేశ నిర్మాణమే బీజెపి లక్ష్యం- అదే బిజెపి విధానం

📰 Generate e-Paper Clip

బిజేపీ చేనేత సెల్ జిల్లా కన్వీనర్ కొక్కుల గణేష్

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

ఏకాత్మ మానవవాద సిద్దాంత పునాదులపై ఎర్పడిన భారతీయ జనతా పార్టీ దేశ నిర్మాణమే లక్ష్యమని అదే బీజెపి విధానమని కొక్కుల గణేష్ అన్నారు. సోమవారం భారతీయ జనతా పార్టీ 47 వ ఆవిర్భావ వేడుకలను మోరపల్లి లో పార్టీ జెండా ను ఆవిష్కరించి ఘనంగా జరుపు కోన్నారు. ఈ సందర్బంగా గణేష్ మాట్లాడుతూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ల స్ఫూర్తి తో 1980 లో రెండు సిట్లతో మొదలైన బిజెపి పార్టీ ప్రయాణం నేడు దేశ వ్యాప్తంగా కోట్లాది మంది కార్యకర్తలతో అతిపెద్ద పార్టిగా బిజెపి ఆవిర్భావించిందన్నారు. ఏకాత్మ మానవతవాదం, అంత్యోదయ సిద్దాంతంతో దేశాభివృద్ధికి కృషి చేస్తున్నది బీజేపీ పార్టీ అని అన్నారు. అనంతరం స్విట్లు పంపిన చేసి 47 వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ కార్యక్రమం లో జగిత్యాల రూరల్ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు కర్నె నరసింహారెడ్డి, బూత్ అధ్యక్షులు బొమ్మకంటి గంగాధర్, గడ్డం రమేష్, ముంజల శేఖర్ గౌడ్, తూకుంట్ల రాంరెడ్డి, మ్యాకల నారాయణ, సంకోజి భాస్కర్, బొమ్మ కంటి రాజన్న, మైదం దశరథం, కాలగిరి మోహన్ రెడ్డి, చిట్యాల వేణు, బండి సురేష్, పత్తిరెడ్డి తిరుపతిరెడ్డి, ఎడమల రాజిరెడ్డి, మంగళారపు దుబ్బారెడ్డి గంగేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నా

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular