నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి :
మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఔట్సోర్సింగ్ వర్కర్స్ మరియు అన్ని సెక్షన్లు పనిచేసే కార్మికులు సమావేశమై నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. నూతన అధ్యక్షుడిగా లంక శ్రీకాంత్ ఉపాధ్యక్షులుగా ఉల్లెందుల శీను కార్యదర్శిగా అంతడుపుల అనిల్ కోశాధికారిగా లంక సంజీవ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సోమవారం ఉదయం ఏఐటీయూసీ జగిత్యాల జిల్లా కార్మిక సంఘం అధ్యక్షుడు బర్ల లక్ష్మణ్ వారిని శాలువా తో నూతన కార్యవర్గాన్ని సన్మానించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ జవాన్ ముజీబ్,నిజాముద్దీన్ యమ నరసయ్య మధురమ్మ లోకిన్ మహేష్ కుమార్ తాండ్ర సుమన్ రాజగోపాల్ దొంగిర్ నరేష్ బూరం భాను బర్ల లింగం మరియు కార్మిక సిబ్బంది పాల్గొన్నారు.

