నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:
పెద్దమ్మ తల్లివిగ్రహ పునఃప్రతిష్టాపన “బోనాల” మహోత్సవం మల్లాపూర్ మండల కేంద్రం లో ముదిరాజ్ సంఘం వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవం గా నిర్వహించారు.ఈ సందర్బంగా మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో మల్లాపూర్ ప్రజలందరూ పాడి పంటలతో శుబీక్షం గా ఉండాలని ఆ అమ్మ వారిని ప్రార్తించానని అన్నారు.ఈ కార్యక్రమం లో ముదిరాజ్ కులస్తులు,ఉప సర్పంచ్ సోమరెడ్డి, వార్డు సభ్యులు ముష్కరి రమేష్, కొంపెల్లి రాకేష్, భుక్యా శేఖర్, ముత్యాల గంగా రాజం, అరికుప్పల చిన్న రాజం, షబ్బీర్, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


