నవగీతం, ఆలేరు ప్రతినిధి :
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి మాట్లాడుతూ ఈద్ అల్-అధా పవిత్ర పండుగ కేవలం ఆనందోత్సవం మాత్రమే కాదని, ఇది తక్వా, సబ్ర్ మరియు త్యాగానికి ప్రతీక అని అన్నారు.ఈ పండుగ ద్వారా మనిషి తన అహంకారాన్ని కుర్బానీ చేసి, నఫ్స్ను నియంత్రించుకోవాలని ఆమె సూచించారు. స్వార్థాన్ని విడిచిపెట్టి, ఇఖ్లాస్తో జీవించే హృదయంలోనే అల్లాహ్ రహ్మత్ ఉంటుందని పేర్కొన్నారు.మనిషిని మతంతో కాకుండా మనసుతో కొలవాలని ఈ పండుగ ప్రపంచానికి గొప్ప సందేశం ఇస్తోందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచానికి కావాల్సింది సంపద కాదు, ఇన్సానియత్ అని అన్నారు.

