టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు
నవగీతం ,కొత్తగూడెం
సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం కు చెందిన మంచినీళ్ల జిన్ను గణేష్ దంపతులు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరై ఆ దంపతులకు నూతన పట్టు వస్త్రాలు పెట్టిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు ఈసందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా సొంత ఇంటి నిర్మాణం కోసం కలలు కంటూ తమ ఆర్థిక స్తోమత సరిగా లేక అద్దె ఇళ్లల్లో ఉంటూ చాలీచాలని జీవనం గడుపుతు సొంత ఇంటి కల నెరవేరదు అనుకుని నిరాశ చెందే వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించి రూ.5 లక్షల రూపాయలు అందజేసిందని ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మరింత మెజారిటీ ఇవ్వాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎల్లప్పుడు నిరుపేదల గురించి ఆలోచించే వ్యక్తులని, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఏదైనా ఇబ్బంది అనిపిస్తే, మంత్రి పొంగులేటితో మాట్లాడి పరిష్కరిస్తానని సీతారాములు పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ మాజీ చైర్మన్ మండె వీరహనుమంతరావు, సింగభూపాలం గ్రామ సర్పంచ్ కిన్నెర వెంకన్న,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బైరు సాంబయ్య, రాసబంటి బాబు, నలగొర్ల మల్లయ్య, బత్తుల కేశవరావు, ముత్తిని. వెంకటేశ్వర్లు,చిమట నాగేశ్వరరావు, మెట్టెల సైదుబాబు,సాయిన్ని నర్సింహారావు, దామర్ల సర్వేశ్వరరావు,యువజన కాంగ్రెస్ నాయకులు కొమారి రవీందర్, గుగులోతు కోటేష్ మరియు బందుమిత్రులు పాల్గొన్నారు.

