సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య
నవగీతం, మల్లాపూర్
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య అన్నారు.మన గ్రామంలో పేదవారికి ఆహార భద్రత కల్పించి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని , గత 10 ఏళ్లుగా రాని రేషన్ కార్డులు రావడంతో ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య , ఏఎంసీ చైర్మన్ అంతడుపుల పుష్పలత నర్సయ్య, మాజీ సర్పంచ్ మామిడి లక్ష్మారెడ్డి నాసం తిరుపతి, అంతడుపుల గంగాధర్ మిద్దె అంజయ్య,గున్నాల విజయ్, కాగు కిరణ్ ,అండెం రాజేష్ జక్కుల శివమణి ,చెప్పల రంజిత్ తదితరులు పాల్గొన్నారు

