నవగీతం, ఇబ్రహీంపట్నం ప్రతినిధి:
ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు మాజీ సర్పంచ్ పుప్పాల నర్సయ్య ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఎగురవేశారు. టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఎగరవేసినట్లు నర్సయ్య తెలిపారు. అనంతరం నినాదాలు చేస్తూ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కంటం రమేష్, తోకల డేవిడ్, కోటి అరుణ్, మాజీ ఉపసర్పంచ్ కోటి దేవరెడ్డి, డాక్టర్ మైపాల్, బైన నడిపి మల్లయ్య, సుంకరి రాజేష్, పుప్పాల చిన్నకాశన్న, సమ్మెట రఘు, కంఠం రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు

