నిరుపేద ఆర్యవైశ్య విద్యార్థికి 25 వేల విద్యా ఖర్చుకు వితరణ..
భగవద్గీత పఠనంలో గోల్డ్ మెడల్ సాధించిన మహిళలకు ఘన సన్మానం..
నవగీతం, వైరా ప్రతినిధి:
వాసవి కళ్యాణ మండపం వైరా మండల పట్టణ ఆర్యవైశ్య మహాసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం.. వాసవి మాత అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారి విగ్రహానికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి జయంతి కార్యక్రమాన్ని అధికారిక పండుగ జాబితాలో చేర్చినందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ నందు అల్పాహార దాన కార్యక్రమం నిర్వహించారు. నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థినికి 25వేలు రూపాయలను ఇంజనీరింగ్ చదివేందుకు ఆర్థిక సాయం అందజేశారు. మైసూర్ దత్త పీఠం వారి నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన ఆర్యవైశ్య సోదరీమణులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కళ్యాణమండపం గౌరవ అధ్యక్షులు వనమా విశ్వేశ్వరరావు, అధ్యక్షులు డాక్టర్ పెరుమాళ్ళ కృష్ణమూర్తి, సెక్రెటరీ నూకల శ్రీనివాసరావు, వైరా మండల ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మిట్టపల్లి కిరణ్ కుమార్, సెక్రటరీ కొల్లా రాంబాబు వాసవి డైమండ్ అధ్యక్షులు నంబూరు శ్రీనివాసరావు, సెక్రటరీవజినే పల్లి రవి, వనిత క్లబ్ సెక్రటరీ రాయల అన్నపూర్ణ, కోశాధికారి మిట్టపల్లి సుధారాణి కోదండ రామాలయం మాజీ చైర్మన్ మిట్టపల్లి సత్యంబాబు, ఆర్యవైశ్య సంఘం నాయకులు నూకల ప్రసాదరావు, కటకం బిక్షమయ్య, కొణతం రాజారావు, బోనగిరి సతీష్, గజ్జల భాస్కర్, కొప్పురావూరి సత్యనారాయణ, తెల్లాకుల సందీప్, పెరుమాళ్ళ కటకం శివకృష్ణ,బోనాల సాయి నిఖిల్, కాజా కృష్ణమూర్తి, నాళ్ళ నాగేశ్వరరావు, రాయపూడి సత్యం, మిట్టపల్లి నాగేశ్వరరావు,నాళ్ళ గంగాధర్, రాయల కృష్ణారావు, గజ్జల నాగేశ్వరరావు, మిట్టపల్లి శ్రీమన్నారాయణ, రాయల ప్రసాదరావు, లగడపాటి బోసు,మహిళా భక్తులు వనమాణికుమారి, రాయపూడి రజని, నాళ్ల మల్లేశ్వరి, మిట్టపల్లి రాజ్యలక్ష్మి, రాయపూడి మాధవి, కొణతం గీత, కటకం దివ్య, రాయల రోజా, సుగ్గల మాధవి, నూకల వాణిశ్రీ, తదితరులు పాల్గొన్నారు..


