నవగీతం, వెల్గటూర్
వెల్గటూర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో గత ఐదు రోజుల క్రితం క్రితం నల్లూరి లక్ష్మి అనే మహిళా అనారోగ్యంతో మృతి చెందింది. కాగా లక్ష్మిది చాలా నిరుపేద కుటుంబం. ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, సోషల్ మీడియా నుండి పలువురు దాతలు సేకరించిన సుమారుగా రూ.75,500 నగదు, 50కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా అల్లం అనిల్ కుమార్ సోషల్ మీడియా సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సహాయ కోరిన వెంటనే స్పందించిన దాతలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

