ఎడిటోరియల్
మెట్పల్లి,సెప్టెంబర్16,(నవగీతం) కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన ఇన్ఛార్జి డాక్టర్ రఘు కుటుంబాన్ని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఇటీవల డాక్టర్ రఘు తల్లి పుష్పలత మృతి చెందడంతో జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని వారి నివాసానికి బుధవారం ఆమె వెళ్లారు. ఈ సందర్భంగా పుష్పలత చిత్రపటం వద్ద పూలు...
జగిత్యాల
బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం: మంత్రి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల/ఎండపల్లి,సెప్టెంబర్14,(నవగీతం): వెల్గటూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ ఇటీవల మరణించగా ఎండపల్లి మండలం లోని గుల్లకోట గ్రామంలో మృతుని కుటుంబాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని మంత్రి తెలిపారు. మృతుని కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ. 50వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్న సింహాచలం జగన్ కుటుంబానికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని మంత్రి...
జగిత్యాల
మెట్ పల్లి, సెప్టెంబర్ 13 (నవగీతం): కోరుట్ల తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) ఇంచార్జి, నాయకులు డాక్టర్ రఘు తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి...
జగిత్యాల
16వ వార్డులో ఉచిత స్టీల్ బ్యాంక్ సేవలు ప్రారంభం మెట్పల్లి, సెప్టెంబర్ 13 (నవగీతం): వినాయక చవితి సందర్భంగా 16వ వార్డు ప్రజల కోసం ఉచిత స్టీల్ బ్యాంక్ సేవా పథకాన్ని ఆదివారం కౌన్సిలర్ అరిసె వనజ మురళి వాడకట్టు ప్రజల మధ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ అరిసె వనజ మురళి మాట్లాడుతూ.. ఇంట్లో జరిగే...
జగిత్యాల
మెట్ పల్లి, సెప్టెంబర్ 13 (నవగీతం): పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మెట్ పల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఎలాగందుల అజయ్ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాలకు...
జగిత్యాల
మెట్ పల్లి,సెప్టెంబర్13,(నవగీతం):మెట్పల్లి సీఐ సురేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని పలువురు నాయకులు ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం మల్లాపూర్ మండల అధ్యక్షుడు పెద్దిరెడ్డి లక్ష్మణ్ ,బీఆర్ఎస్ పార్టీ కార్మిక శాఖ మల్లాపూర్ మండల అధ్యక్షుడు ఉయ్యాల లక్ష్మణ్, నాయకులు జెల్ల...
జగిత్యాల
శాలువాతో సన్మానించిన యూత్ సభ్యులు మల్లాపూర్, సెప్టెంబర్ 13 (నవగీతం): మల్లాపూర్ మండల కేంద్రంలోని 11వ వార్డులో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వార్డు సభ్యులు మహమ్మద్ షబ్బీర్ శివసేన యూత్ సభ్యులకు టీషర్ట్లను పంపిణీ చేశారు. మతాలకు అతీతంగా టీషర్ట్లను పంపిణీ చేసి సోదరభావాన్ని చాటిన మహమ్మద్ షబ్బీర్ను ఈ సందర్భంగా వార్డు ప్రజలు అభినందించారు. పండుగల సందర్భంగా...
కరీంనగర్
డిజిటలైజ్ చేసేందుకు సహకరించాలి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే కరీంనగర్, సెప్టెంబర్11,(నవగీతం):ప్రాచీన విజ్ఞానాన్ని భద్రపరచడానికి, డిజిటలైజ్ చేసేందుకు జ్ఞాన్ భారతం మిషన్ కార్యక్రమాన్ని భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిందని, ఇందులో భాగంగా జిల్లాకు చెందిన ప్రాచీన తాళపత్రాలు, గ్రంథాలు, శాసనాలను గుర్తించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులకు సూచించారు.జ్ఞాన్ భారతం...
ములుగు
పక్కా భవనం లేక తీవ్ర ఇబ్బందులు మొట్లగూడెం గ్రామంలో విద్యార్థుల దుస్థితి. నుగురు వెంకటాపురం,సెప్టెంబర్ 11,(నవగీతం):ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని రాచపల్లి గ్రామ పంచాయతీకి చెందిన మొట్లగూడెం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారయ్యింది.విద్యార్థులకు చదువుకునేందుకు పక్కా పాఠశాల భవనం లేక తాత్కాలికంగా తాటకుల గుడిసెలో తరగతి గదులు నిర్వహిస్తున్న సంఘటన ఆదివాసీ గ్రామీణ విద్యార్థులపై ప్రభుత్వాల ప్రేమ ఏమిటో చెప్పకనే చెబుతుంది.అసలేవర్షాకాలం కావడం తో గుడిసెలో తరగతులు నిర్వహించాలంటే తీవ్ర ఇబ్బందికి గురవుతున్నామని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. కొత్త భవనం మంజూరు చేయాలని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నిసార్లు మండల విద్యాధికారికి,తహసీల్దార్ కు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పిల్లలకు పాఠశాలలో సరైన వసతులు లేక,తాటాకుల గుడిసెలో ఎండకు ఎండివానకు తడిసి చదువును కొనసాగిస్తుంటే, కనీసం సంబంధిత అధికారులు పట్టించు కోవడంలేదని గ్రామస్తులు అవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి కొత్త భవనం నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
జగిత్యాల
సారంగాపూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జగిత్యాల, సెప్టెంబర్11,(నవగీతం):జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, నేరాల దర్యాప్తు పురోగతి, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించే క్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ శుక్రవారం సారంగాపూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, పెండింగ్...
జగిత్యాల
పదో తరగతి విద్యార్థినులకు విద్యాభ్యాసం, పరీక్షల సన్నద్ధతపై మార్గనిర్దేశం జగిత్యాల, సెప్టెంబర్11,(నవగీతం): జగిత్యాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం నాణ్యత, రుచితో పాటు...
జగిత్యాల
నో మ్యాపింగ్, అనామలీస్ ఓటర్లకు నోటీసులు వ్యక్తిగతంగా అందజేయాలి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల/ధర్మపురి, సెప్టెంబర్11,(నవగీతం): ధర్మపురి మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను శుక్రవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్ఐఆర్లో భాగంగా జారీ...
జగిత్యాల
మెట్పల్లి,సెప్టెంబర్11,(నవగీతం):వినాయక నవరాత్రి ఉత్సవాలను పర్యావరణహితంగా నిర్వహించేందుకు స్నేహాలయ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వినాయక మండపాల్లో మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించడంతో పాటు నవరాత్రి ఉత్సవాల సమయంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించే మండప నిర్వాహకులను అభినందిస్తూ “స్నేహాలయ పురస్కార్” అవార్డును అందజేయనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు కోట కిరణ్ కుమార్ తెలిపారు.మండపాల్లో...
జగిత్యాల
మల్లాపూర్,సెప్టెంబర్10,(నవగీతం): మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన శంభు తిరుపతి-అనిత దంపతుల కుమారుడు త్రినయ్ ఇటీవల జరిగిన ఎంబీబీఎస్ మొదటి రౌండ్ కౌన్సిలింగ్ ఫలితాల్లో స్టేట్ మెరిట్ ర్యాంక్ సాధించిన సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ మండల అధ్యక్షుడు సంగ గంగరాజం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యుడిగా ఎదగాలనే లక్ష్యంతో చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ క్రమశిక్షణతో కష్టపడి చదివి మంచిర్యాంకు సాధించడం ఎంతోమంది విద్యార్థులక ఆదర్శం భవిష్యత్తులో మంచి వైద్యుడిగా ఎదిగిప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అరకంటి గంగ మల్లయ్య,వేల్పుల రాజం,జాల మల్లేష్,ఎగుర్ల కొమురయ్య,తొట్ల మల్లయ్య, బింగి మల్లేష్, మధు, సంపత్, రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు
జగిత్యాల
మల్లాపూర్,సెప్టెంబర్10,(నవగీతం): ఎంబిబిఎస్ లో సీటు సాధించిన కేరళ హైస్కూల్ పూర్వ విద్యార్థిని మోతే హన్సిక ను కేరళ హై స్కూల్ ప్రిన్సిపల్ సీబీ.అనిల్ సింగ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అనిల్ మాట్లాడుతూ తమ పాఠశాలలో చదివి ప్రస్తుతం ఎంబిబిఎస్ లో సీటు పొందటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ,రాబోయే రోజుల్లో డాక్టర్ గా ప్రజలకు సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు షీనా, సాయి రాణి,శ్వేత,రజిత లు పాల్గొన్నారు.
ఎడిటోరియల్
కలెక్టరేట్ లో ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల, సెప్టెంబర్10,(నవగీతం):తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిన ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లో గురువారం జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పాల్గొని, వీరనారి చాకలి ఐలమ్మచిత్ర పటానికి పూల మాల వేసి...
జగిత్యాల
జగిత్యాల,సెప్టెంబర్8,(నవగీతం):జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో హైడ్రా కమిషనర్ శ్రీ ఎ.వి. రంగనాథ్, ఐజీ, హైడ్రా కమిషనర్ కుటుంబ సమేతంగా శ్రీ అంజన్న స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్.అంజనా రెడ్డి, ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పూజా కార్యక్రమాలు...
జగిత్యాల
మల్లాపూర్,సెప్టెంబర్8,(నవగీతం):ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ రెడ్డి సామాజిక వర్గంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రెడ్డి సంఘం నాయకులు మంగళవారం మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చట్టంపై గౌరవంతో పోలీసులను ఆశ్రయించినట్లు వారు తెలిపారు. రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని,ఈ వ్యాఖ్యలపై చట్టపరంగా తగిన చర్యలు...
జగిత్యాల
మల్లాపూర్,సెప్టెంబర్8,(నవగీతం): విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, క్రీడల ద్వారా విద్యార్థుల్లో మానసిక,శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ,నాయకత్వ లక్షణాలు,జట్టు స్ఫూర్తి పెంపొందుతాయని మండల విద్యాధికారి కే దామోదర్ రెడ్డి అన్నారు.2026-27 విద్యా సంవత్సరానికి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మండలస్థాయి క్రీడా పోటీలు మంగళవారం సాతరం ఉన్నత పాఠశాల ఆవరణలో ఘనంగా ప్రారంభమయ్యాయి.మండలంలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు.మండలస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేసేందుకు సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో మూడు రోజుల పాటు వివిధ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు.ఈ క్రీడా ఉత్సవాలను మండల విద్యాధికారి కేతిరి దామోదర్ రెడ్డి,మండల అభివృద్ధి అధికారి శ్రీకాంత్, గ్రామ సర్పంచ్ పోతవేణి నారాయణ గౌడ్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు జలపతి రెడ్డి,గొర్రెపల్లి సర్పంచ్ వెంకట్ రెడ్డి నాయకులు దప్పుల నర్సయ్య,మాట్లా సోమయ్య,గడ్డం సోమరెడ్డి,సాతారం ఉపసర్పంచ్ జగన్ రెడ్డి పాఠశాలప్రధానోపాధ్యాయులు శ్రీహరిప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు అపర్ణ ఎస్జిఎఫ్ఐ మండలకన్వీనర్ వినోద్ మండలంలోని అన్ని పాఠశాలల నుంచి వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు,ఇతర ఉపాధ్యాయులు,ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
జగిత్యాల
నవగీతం, సెప్టెంబర్8,(నవగీతం):మల్లాపూర్ మండలం రేగుంట గ్రామానికి చెందిన మోతే శ్రీనివాస్-సంజన దంపతుల కుమార్తె హన్సిక ఇటీవల జరిగిన ఎంబిబిఎస్ మొదటి రౌండ్ కౌన్సెలింగ్ ఫలితాల్లో స్టేట్ మెరిట్ ర్యాంక్ సాధించిన సందర్భంగా రేగుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ తీట్ల లహరి రాజేష్ ఆద్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వైద్యురాలిగ ఎదగాలనే...